News March 9, 2026
HYD: నేడు స్కాట్లాండ్తో భారత్ ఢీ

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.
Similar News
News March 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్కు..రైతుకు రీలిఫ్ అందెనా?

ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందేనా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతుంది. వంశధార కాలువలలో పూడిక, గుర్రపు డెక్క నిండిపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు పారడం లేదు. జిల్లాలో వంశధార ఎడమ కాలువ ద్వారా సుమారు 2,11,030 ఎకరాలు సాగవుతుంది. ఉపాధి హామీ నిధులతోనైనా పిల్ల కాలువలు కాలువలలోని పూడిక తీత పనులు నిర్వహించి కాలువలను ఆధునీకరిస్తే శివారు ప్రాంత రైతుల ఆశలు నెరవేర్చవచ్చు.
News March 9, 2026
రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.
News March 9, 2026
నల్గొండ: మార్చి 10 నుంచి పశువులకు టీకాలు

నల్గొండ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ జి.వి. రమేష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పశువులకు టీకాలు వేసేందుకు 80 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా జరిగే ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


