News March 9, 2026
స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్.. ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఏకంగా 753 పాయింట్ల మేర పడిపోయిన నిఫ్టీ.. మధ్యాహ్నానికి కోలుకుని 24,028(-422) వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద స్థిరపడింది. రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్, మారుతి, SBI, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ₹7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
Similar News
News April 6, 2026
జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమైందా?

UCC(యూనిఫామ్ సివిల్ కోడ్), జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయని, మంచి పురోగతి కనిపిస్తోందని ఇవాళ BJP వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. త్వరలో జనగణన మొదలుకానుంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
News April 6, 2026
త్వరలోనే తులం బంగారం: మంత్రి శ్రీధర్ బాబు

TG: ఎన్నికల్లో తామిచ్చిన హామీలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసే లోపు వంద శాతం అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పటికే మెజార్టీ హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన వధువులకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే 420 హామీలంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
News April 6, 2026
సీజ్ఫైర్ను తిరస్కరించిన ఇరాన్.. ట్రంప్ వార్నింగ్!

సీజ్ఫైర్పై పాకిస్థాన్ ద్వారా US పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 10 కండిషన్లు పెట్టింది. ఒక్క సీజ్ఫైర్తో సరిపెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. హార్ముజ్పై తమ కంట్రోల్కు గుర్తింపు, ఆంక్షలు ఎత్తివేత, నష్టపరిహారం మొదలైనవి డిమాండ్లుగా పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


