News May 5, 2024
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

➣AP: ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తాం: జగన్
➣పేదల భూములు దోచేసే చట్టం LTI: చంద్రబాబు
➣LTI యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉంది: సజ్జల
➣బూతులు తిట్టేవాళ్లను మోకాళ్లపై కూర్చోబెడతాం: పవన్
➣TG: కేసీఆర్ ఏ కూటమిలో చేరుతారు?: సీఎం రేవంత్
➣గాడిదతో రేవంత్ గుడ్లు పెట్టిస్తున్నారా: కిషన్ రెడ్డి
➣TG: కొత్త జిల్లాలు కొనసాగించాలి.. లేకుంటే ఉద్యమం తప్పదు: కేటీఆర్
➣IPL.. గుజరాత్పై బెంగళూరు విజయం
Similar News
News March 16, 2026
ఆయన త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నేడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం. అందుకే ‘శ్రీరాములు లాంటి వారు మరో పదిమంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం తెస్తాను’ అని గాంధీజీ చెప్పేవారు.
News March 16, 2026
నాడు ఫ్రీగా యాక్టింగ్.. నేడు ₹5.5 కోట్ల రాయల్టీ!

ఆస్కార్ అవార్డు పొందిన ‘స్లమ్డాగ్ మిలియనీర్’ చిత్రం తనను మిలియనీర్ను చేసిందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘నిర్మాతలు తన ఫీజును భరించలేమని చెప్పడంతో ఫ్రీగా నటించా. అయితే సినిమా ఘనవిజయం సాధించాక వారు స్వచ్ఛందంగా పంపిన రాయల్టీ ద్వారా ₹5.5 కోట్లకు పైగా అందుకున్నా. ఇటీవలే రూ.3లక్షల చెక్ వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
News March 16, 2026
షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్లైన్లో సన్ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్లైన్లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్ఫ్లవర్కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.


