News May 5, 2024
ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటీ?: చంద్రబాబు

AP: సీఎం జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటనీ ఆయన ప్రశ్నించారు. ‘కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం. రైతుల ఫొటోలతోనే కొత్త పాస్బుక్లు ఇస్తాం. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి’ అని ఆయన కోరారు.
Similar News
News April 1, 2026
‘ధురంధర్-2’ స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’కు ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది. తన స్టోరీనే కాపీ కొట్టి సినిమా తీశారని కన్నడ డైరెక్టర్ ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆరోపించారు. 2023లోనే స్క్రిప్ట్ను రిజిస్టర్ చేయించానని.. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు కథ వినిపించానని తెలిపారు. ఇటీవల సినిమా చూడటంతో విషయం తెలిసిందని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.
News April 1, 2026
అర్షదీప్ సింగ్ ఖాతాలో చెత్త రికార్డు

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో తన చివరి ఓవర్లో అర్షదీప్ ఏకంగా 11 బంతులు వేశారు. దీంతో ఐపీఎల్లో సుదీర్ఘ ఓవర్ వేసిన ఆరో బౌలర్గా నిలిచారు. ఇప్పటికే తుషార్ దేశ్పాండే (CSK), సిరాజ్ (RCB), హార్దిక్ పాండ్య (MI), సందీప్ శర్మ (RR), శార్దూల్ థాకూర్ (LSG) పేరిట ఈ రికార్డ్ ఉంది.
News April 1, 2026
ఈరోజు నుంచి టెక్ కంపెనీలపై దాడులు: ఇరాన్

గల్ఫ్లో అమెరికా స్థావరాలు, రిఫైనరీలపై దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపై గురి పెట్టింది. తమపై దాడులకు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 కంపెనీల ఆఫీసులపై దాడులు చేయనున్నట్లు ప్రకటించింది. ఈరోజు రాత్రి 10 నుంచి ఈ దాడులు ప్రారంభమవుతాయని.. ఉద్యోగులు ఆఫీసులు వదిలి ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించింది. కాగా ఇరాన్పై దాడుల్లో US <<19308462>>ఏఐ<<>> ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.


