News May 5, 2024
కడప: ‘భద్రతా నిఘా చర్యలను పటిష్టం చేయాలి’

వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే పోలీసు భద్రతా, నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయ్ రావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కునాల్ సిల్కు సమావేశం నిర్వహించారు.
Similar News
News March 23, 2026
కడప: ఇవాళ్టి పరీక్షకు 27,677 మంది హాజరు!

కడప జిల్లాలో 167 కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి గణితం పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 27,861 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,677 మంది పరీక్షలు రాశారు. 184 మంది ఆబ్సెంట్ అయ్యారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 సెంటర్లను, 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలు జరిగాయి. 2,386 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,989 మంది రాశారు. 397 మంది గైర్హాజరయ్యారు.
News March 23, 2026
కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.
News March 23, 2026
కడప జిల్లాలో అకాల వర్షాలకు 246 ఎకరాల్లో పంట నష్టం.!

కడప జిల్లాలో ఈనెల 19, 20 తేదీలలో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు 246 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు 178.5 ఎకరాల్లో మొక్కజొన్న, 67.5 ఎకరాల్లో సజ్జ పంటలకు నష్టం జరిగింది. కొండాపురం, కమలాపురం, సింహాద్రిపురం, ముద్దనూరు, VN పల్లె, కాశినాయన మండలాల్లో పంటలు నష్టపోయాయి. ఈ మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 107 మంది రైతులు నష్టపోయారని MAOలు ప్రాథమిక అంచనాలు రూపొందించారు.


