News March 10, 2026

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృథ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.

Similar News

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.

News April 17, 2026

విజయవాడ: ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

image

విజయవాడలో ‘లెమన్ ఎక్స్చేంజ్’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బుకీ చాంద్ బాషా, సబ్ బుకీ పోతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.

News April 17, 2026

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.8,939

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939 పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలు రూ.6,076 ధరలు లభించాయి. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవని వారు మండిపడుతున్నారు.