News March 10, 2026
ఇకపై రైతులు ‘గడ్డి మందు’ కొనాలంటే..

TG: కలుపు నివారణకు ఉపయోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ రైతుల ప్రాణాలకు ముప్పుగా మారింది. దీంతో దాని విక్రయాలపై ప్రభుత్వం నియంత్రణ చేపట్టింది. ఇకపై వ్యవసాయ అధికారులు పొలాలను పరిశీలించి గడ్డి మందు అవసరమని భావిస్తేనే కొనుగోలుకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని ఆదేశించింది. దాని ఆధారంగానే అన్నదాతలకు మందులను విక్రయించాలని, ఇందుకు ప్రత్యేక రిజిస్టర్ మెయింటెన్ చేయాలని షాపులకు సూచించింది.
#ShareIt
Similar News
News April 6, 2026
GK: ముఖ్య పదవులు.. కనీస వయసు

*రాష్ట్రపతి- 35 ఏళ్లు
*ఉపరాష్ట్రపతి- 35
*గవర్నర్- 35
*ఎమ్మెల్సీ- 30
*రాజ్యసభ సభ్యుడు- 30
*ప్రధాని- 25
*లోక్సభ ఎంపీ- 25
*ఎమ్మెల్యే- 25
*సీఎం- 25
*సర్పంచ్- 21
News April 6, 2026
తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్-2 చరిత్ర సృష్టించింది. దేశంలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ఘనత సాధించింది. నిన్న 18వ రోజు దేశవ్యాప్తంగా 4,030లు షోలు పడగా రూ.3.82 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు (రూ.1,234 కోట్లు) సాధించిన రికార్డు పుష్ప-2 పేరిట ఉంది. ఆ తర్వాత బాహుబలి-2 రూ.1,030 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
News April 6, 2026
అమెరికా పిచ్చి పనులు చేస్తే.. ఇరాన్ వార్నింగ్

మంగళవారం రాత్రి లోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై సుప్రీం లీడర్ మొజ్తబా అడ్వైజర్ అలీ అక్బర్ దీటుగా స్పందించారు. ‘అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్-అల్-మండెబ్ మూతపడుతుంది’ అని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రంలోని బాబ్-అల్-మండెబ్ ఆయిల్, ఇతర వస్తువుల రవాణాకు ఎంతో కీలకం. హార్ముజ్ మూసివేతతో సౌదీ ఇక్కడి నుంచే ఆయిల్ ఎగుమతి చేస్తోంది.


