News May 5, 2024

రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ

image

AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల 7న రాజంపేట నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Similar News

News December 27, 2025

సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

image

నైట్ ఔట్‌లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్‌స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.

News December 27, 2025

పరకామణి కేసు.. HCకి ఏసీబీ మధ్యంతర నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ ఇవాళ హైకోర్టుకు మధ్యంతర నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. కేసు పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవసరం ఉందని, సీఐడీ దీన్ని పరిశీలించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.

News December 27, 2025

MSVG: 30న ‘మెగా విక్టరీ’ సాంగ్

image

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(MSVG) నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి స్టెప్పులేసిన ‘మెగా విక్టరీ’ మాస్ సాంగ్ ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రోమో రేపు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.