News May 5, 2024
ఈసీకి ఫిర్యాదు చేస్తా: సీఎం రమేశ్

AP: అనకాపల్లి జిల్లా తారువలో తనపై వైసీపీ నేతలు <<13183356>>దాడికి <<>>పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. ‘డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. అనకాపల్లి ఎంపీ స్థానంలో ముత్యాలనాయుడు, మాడుగులలో ఆయన కుమార్తె ఓడిపోతామనే భయంతోనే ఇలా దాడులకు దిగుతున్నారు’ అని ఆగ్రహించారు.
Similar News
News March 16, 2026
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా.. దాని విలువెంత?

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ట్రోఫీ తప్ప ప్రత్యేకంగా నగదు బహుమతి అంటూ ఏమీ ఇవ్వరు. ఒక్కో ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే విజేతలు తమకు వచ్చిన బహుమతిని విక్రయించేందుకు వీలులేదు. అకాడమీకి 1 డాలర్కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 1951లో ఈ రూల్ తెచ్చారు. 1950కి ముందు ఇచ్చిన అవార్డులకు ఇది వర్తించదు. ఓ ఆస్కార్ అవార్డు అధికారిక విలువ $1 అయినా.. అది తెచ్చిపెట్టే ప్రతిష్ఠ ఎనలేనిది. ఏమంటారు?
News March 16, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News March 16, 2026
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.


