News May 5, 2024
ఒకే వీధిలో వేర్వేరు రాష్ట్రాలు!

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. విభజన తర్వాత ఆయన ఇల్లు తెలంగాణ మహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వెళ్లింది. అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్సభ స్థానంలో ఉండటం విశేషం.
Similar News
News March 20, 2026
తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన

TGలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, NZB, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 41-61KM వేగంతో గాలులు వీచే ఆస్కారముందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు నిన్న రాత్రి HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
News March 20, 2026
108ఏళ్ల మాజీ MLA కన్నుమూత

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్(108) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబర జీవితం గడిపారు. ప్రభుత్వ పెన్షన్తోనే జీవనం సాగించారు.
News March 20, 2026
ఉద్యాన పంటలపై అకాల వర్షాల పంజా

AP: అనంతపురం, శ్రీసత్యసాయి, NTR జిల్లాల్లోని ఉద్యాన పంటలపై అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, బత్తాయి పంటలతో పాటు టమాట, ఇతర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని, వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.


