News May 5, 2024
ఇవాళ 3 చోట్ల అమిత్షా.. 2 చోట్ల రాహుల్ సభలు

తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగజ్నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా.. నిర్మల్, అలంపూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో మాట్లాడనున్నారు. అటు ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ TGలో పర్యటించనున్నారు.
Similar News
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
News January 21, 2026
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


