News March 11, 2026

నంద్యాల: ‘పచ్చని’ ప్రమాదమంటే ఇదే!

image

నంద్యాల జిల్లాలో విద్యుత్ స్తంభాలకు పలుచోట్ల పిచ్చి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా ఉన్నాయి. మేత కోసం వెళ్లి జంతువులు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజలు సైతం ప్రమాదాల బారిన పడ్డారు. వెలుగోడులోని జమ్మి నగర్ సమీపాన రామసముద్రం చెరువు వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు మీ ప్రాంతంలో ఉన్నాయా? కామెంట్

Similar News

News April 6, 2026

ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

image

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

News April 6, 2026

HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

image

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్‌గా, ఓపెన్ జిమ్‌గా మార్చితే సరి. మీరేమంటారు?

News April 6, 2026

కడప: రవాణా శాఖకు రూ.195.21 కోట్ల ఆదాయం

image

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించింది. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీఓ, పులివెందుల, బద్వేల్, రాజంపేటలో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు, పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.