News March 11, 2026

అల్లూరి: పరీక్షలకు 67 మంది గైర్హాజర్

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 67మంది గైర్హాజర్ అయ్యారని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో మెథ్స్, హిస్టరీ, అకౌంటెన్సీలలో పరీక్ష జరిగిందన్నారు. అల్లూరి జిల్లాలో 387 మందికి గాను 350 మంది విద్యార్థులు పరీక్షలు రాసారన్నారు. పోలవరం జిల్లాలో 338 మందికి గాను 308 మంది హాజరయ్యారని వెల్లడించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయాని చెప్పారు.

Similar News

News April 20, 2026

హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

image

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.

News April 20, 2026

NLG: నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్ధులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థుల కోసం అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు

News April 20, 2026

అనంతగిరి ఏకో టూరిజం ప్రారంభించనున్న స్పీకర్

image

ప్రకృతి ఒడిలో పరవశించే అనంతగిరి పర్యాటక వైభవం నేడు సరికొత్త కాంతులతో వికసించనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు ఈ పర్యాటక రంగాన్ని ప్రారంభించి వికారాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిహారాన్ని చేర్చనున్నారు. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ చార్మినార్ జోన్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమేరా హాజరవుతారని వికారాబాద్ BFO జ్ఞానేశ్వర్ తెలిపారు. VKB అభివృద్ధికి ఇది కీలకం కానుంది.