News March 12, 2026

గతం ఘనం.. AUలో పరిశోధకులకు కష్టకాలం

image

AUలో PHD చేస్తున్న పరిశోధక విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన స్టైఫండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. UGC మార్గదర్శకాల ప్రకారం అనేక జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతినెలా స్టైఫండ్ అందుతోంది. కేరళ, తమిళనాడులో నెలకు రూ.15 వేల వరకు ఇస్తున్నారు. అయితే AUలో మాత్రం తగిన మద్దతు లేకపోవడంతో పరిశోధనపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

Similar News

News April 20, 2026

భీమిలిలో వ్యక్తి ఆత్మహత్య

image

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మైలపల్లి సతీశ్ (35) చాకుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఈ ఘటనకు కారణమని భీమిలి ఎస్ఐ సురేశ్ తెలిపారు.

News April 20, 2026

విశాఖ రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖలోని పలు రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జేసీ విద్యాధరి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్‌ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్, సీతమ్మధార రైతుబజార్‌లో స్వీపర్, ఆరిలోవ రైతుబజార్‌లో డే వాచ్‌మెన్‌ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News April 20, 2026

విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

image

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.