News May 5, 2024
జగ్గయ్యపేటలో గెలిచి చరిత్ర సృష్టించిన భార్యాభర్తలు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు MLAలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. ముక్తాల గ్రమానికి చెందిన వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వరప్రసాద్ అప్పటి ఎన్నికలో స్వంతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్పై MLAగా గెలుపొందారు. 1974లో అయన మరణానంతరం భార్య రాజ్యలక్ష్మమ్మ కాంగ్రెస్లో చేరి MLAగా గెలిచి 4ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్యాభర్తలు MLAగా గెలిచిన ఘనత అప్పట్లో జగ్గయ్యపేటకే దక్కింది.
Similar News
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.
News January 6, 2026
బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
News January 6, 2026
కృష్ణా: కోడి పందేల నిషేధంపై కరపత్రల ఆవిష్కరణ

జిల్లాలో కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డీ.కే.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీసీఏ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కోడిపందేల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.


