News May 5, 2024
NLR: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఇవాళ ఓటు వేయనున్నారు. కావలి జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఉద్యోగులు క్యూలైన్లలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనెల 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం ఉంది.
Similar News
News October 22, 2025
కరేడులో 672 ఎకరాల భూసేకరణ పూర్తి: కలెక్టర్

ఉలవపాడు(M) కరేడులో తాజాగా 80 ఎకరాల భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలిపారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం కరేడులో 4,800 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 672 ఎకరాలకు పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో కరేడు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 22, 2025
గుడ్లురులో ప్రమందం.. 50కి పైగా గొర్రెలు మృతి

గుడ్లూరు మండలంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవేపై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల – వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు గుడ్లూరు పోలీసులు తెలిపారు.
News October 21, 2025
రేపు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.