News March 13, 2026
సెలవు తేదీ మార్పు

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.
Similar News
News April 3, 2026
ఇరాన్లో కాదు.. USలో ‘పాలన’ మారుతోంది!

ఇరాన్లో <<16787359>>పాలన మార్పు<<>> జరగాలని US అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇరాన్ ప్రతిఘటనతో అది సాధ్యం కాలేదు. అందుకు విరుద్ధంగా US ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి. కీలక ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్పై <<19554260>>వేటువేశారు<<>>. FBI చీఫ్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని సమాచారం. ఇంకెంత మందిపై వేటు పడుతుందో?
News April 3, 2026
YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.
News April 3, 2026
అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>


