News March 13, 2026
అనకాపల్లి: 124 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News April 20, 2026
అనంతగిరి ఏకో టూరిజం ప్రారంభించనున్న స్పీకర్

ప్రకృతి ఒడిలో పరవశించే అనంతగిరి పర్యాటక వైభవం నేడు సరికొత్త కాంతులతో వికసించనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు ఈ పర్యాటక రంగాన్ని ప్రారంభించి వికారాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిహారాన్ని చేర్చనున్నారు. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ చార్మినార్ జోన్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమేరా హాజరవుతారని వికారాబాద్ BFO జ్ఞానేశ్వర్ తెలిపారు. VKB అభివృద్ధికి ఇది కీలకం కానుంది.
News April 20, 2026
వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్కు ఏర్పాట్లు

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.
News April 20, 2026
HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT


