News May 5, 2024

కాకినాడ: ఓటేసి ఫొటో తీసుకొస్తే రూ.3వేలు?

image

కాకినాడలో పోస్టల్ ఓటింగ్‌లో ఓ పార్టీ నేతలు సిబ్బందిని ప్రలోభపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పీఆర్ డిగ్రీ కాలేజ్‌‌లోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు సిబ్బంది.. ఆ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఓటు వేసినట్లు ఫొటోలు చూపించి రూ.3 వేల చొప్పున తీసుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అలెర్ట్ అయ్యి.. ఫోన్స్ తీసుకెళ్లకుండా చూసినట్లు తెలుస్తోంది.

Similar News

News January 14, 2026

తూర్పు గోదావరి SP వార్నింగ్!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలు, పేకాట, గుండాట వంటి నిషేధిత జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా కోడిపందాల కోసం ఏర్పాటు చేసిన బరులు ధ్వంసం చేశామన్నారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా జీవ హింసకు పాల్పడితే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News January 14, 2026

అధిక చార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు: తూ.గో RTO

image

సంక్రాంతి వేళ ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ మంగళవారం హెచ్చరించారు. RTC ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

News January 13, 2026

NMMS విద్యార్థులకు అలెర్ట్.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

image

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.