News May 5, 2024

కడప: అత్యధికంగా రాజంపేటలో పోలింగ్

image

తొలి రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో 70.03 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 14,389 ఓట్లకు గాను 10,077 ఓట్లు పడ్డాయి. అత్యధికంగా రాజంపేట నియోజకవర్గంలో 89.59 శాతం పోలింగ్ జరిగింది. ఆ తరువాత రాయచోటి నియోజకవర్గంలో 81.47 శాతం ఓట్లు వేశారు. మదనపల్లెలో 81.04 శాతం, రైల్వే కోడూరులో 80.70 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. రాజంపేటలో 1, 386 ఓట్లు పోల్ అయ్యాయి.

Similar News

News November 13, 2025

19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

image

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.

News November 13, 2025

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

image

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.

News November 13, 2025

కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

image

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.