News March 15, 2026
KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 18, 2026
భారత నౌకలపై IRGC కాల్పులు!

హార్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.
News April 18, 2026
MNCL: రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు.. ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ఈ నెల 19న జరగనున్న తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను telanganams.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
ADB: TIMలకు నెట్వర్క్ సెగ

ఆర్టీసీలో ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూయింగ్ మిషన్లకు (TIM)నెట్వర్క్ సమస్యలు శాపంగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లు లేక యంత్రాలు పనిచేయకపోవడంతో కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయలేక, తనిఖీ అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఏజెన్సీల్లో గతంలో మాదిరిగా ముద్రిత టికెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బంది కోరుతున్నారు.


