News March 15, 2026
16న కలెక్టరేట్లో PGRS

సోమవారం ఉ.10-మ.2 గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వొచ్చన్నారు. అర్జీల స్థితిపై 1100 నంబర్కు కాల్ చేయవచ్చని, అర్జీలు Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 17, 2026
GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్డీ చేశారు. దూరదర్శన్లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.
News March 17, 2026
కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.
News March 17, 2026
మాజీ MLA రోహిత్ రెడ్డికి BRS షోకాజ్ నోటీసు

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ పార్టీలో రోహిత్ డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇలాంటి విషయాల్లో పార్టీ అధినాయకత్వం కఠినంగా ఉంటుందని, అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.


