News March 16, 2026
జూన్లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

TG: వరంగల్(D) మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి జూన్లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి PM మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామునూరుకు రూ.850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్నూ ఏర్పాటు చేస్తారని సమాచారం.
Similar News
News April 6, 2026
నిజామాబాద్ ఫోటోగ్రాఫర్కు ప్రథమ బహుమతి

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తన ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా నిలిచిన శ్రీనివాస్ను జిల్లా ప్రజలు, తోటి ఫోటోగ్రాఫర్లు, స్నేహితులు అభినందిస్తున్నారు.
News April 6, 2026
నిజామాబాద్ ఫోటోగ్రాఫర్కు ప్రథమ బహుమతి

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఇంగు శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో తన ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా నిలిచిన శ్రీనివాస్ను జిల్లా ప్రజలు, తోటి ఫోటోగ్రాఫర్లు, స్నేహితులు అభినందిస్తున్నారు.
News April 6, 2026
SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.


