News March 16, 2026
ఢిల్లీ పార్లమెంట్లో ‘సేవ్ ఆర్డీటీ’ నినాదాలు

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీలు, ముఖ్య నేతలు ‘SAVE RDT’ పోస్టల్ కార్డులతో నిరసన తెలిపారు. ఆర్డీటీ సంస్థను కాపాడాలంటూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మల్లికార్జున రెడ్డి, తనుజ తదితరులు నినాదాలు చేశారు. పేదలకు సేవలందిస్తున్న సంస్థపై వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్సీఏను కేంద్రం పునరుద్ధరించాలని కోరారు.
Similar News
News April 6, 2026
ఇరాన్, USకు సీజ్ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.
News April 6, 2026
సంగారెడ్డి: వివాహేతర సంబంధం.. కత్తితో పొడిచి చంపిన భర్త

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాలిలా.. జహీరాబాద్కు చెందిన కవిత(29) గత నెలలో మరొకరితో వెళ్లిపోయింది. జడ్చర్లలో ఆమెను గుర్తించిన పోలీసులు తీసుకొస్తుండగా సదాశివపేట మండలం నందికంది వద్ద మార్గమధ్యంలో భర్త సిద్ధారెడ్డి కత్తితో కవితపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2026
VKB: ‘అధికారులు కీలక భూమిక పోషించాలి’

ప్రజావాణికి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.


