News March 16, 2026
నెల్లూరు కార్పొరేషన్లో 362 ఫిర్యాదులు

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, అదనపు కమిషనర్ హిమబిందు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 43 వ్యక్తిగత వినతులు, సి.పి.ఎమ్ ఆధ్వర్యంలో వచ్చిన 319 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కమిషనర్, వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
బసవేశ్వరుడికి నెల్లూరు కలెక్టర్ నివాళులు

నెల్లూరు కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి సోమవారం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తదితరులు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వర గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అన్నారు. కుల, లింగ వివక్షతను వ్యతిరేకిస్తూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేశారని కొనియాడారు.
News April 20, 2026
ఫలించిన నెల్లూరు కలెక్టర్ ప్రయత్నం

నెల్లూరు ఇన్ఛార్జ్ DPO వసుమతికి ఇటీవలే సీఈవోగా ప్రమోషన్ లభించింది. ఆ తర్వాత ఆమెను తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఆమెకు బాధ్యతలు ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ శాఖ రాష్ట్ర కమిషనర్కు లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను నెల్లూరు జిల్లా స్వర్ణ గ్రామ/వార్డు అధికారిణిగా నియమించారు.
News April 20, 2026
BREAKING: నెల్లూరులో ఘోర ప్రమాదం

నెల్లూరు సిటీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం సమీపంలో స్కూటీని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు చక్రాల కింద పడటంతో స్పాట్లోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూటీ నంబర్ AP40KK6649 ఆధారంగా మృతుల వివరాలు సేకరిస్తున్నారు.


