News March 17, 2026

HYD: సమ్మర్.. METROనే బెటర్..!

image

పెరుగుతున్న ఎండలతో HYD జనం ఇప్పుడు ఎక్కువగా METROలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. RTCతో పోల్చితే టికెట్ ధరలు ఇంచుమించు ఒకేళా ఉండడంతో మెట్రో జర్నీనే బెటర్ అంటున్నారు. ఇందుకు ముఖ్య కారణాలు సిటీలో పర్సనల్ వెహికిల్‌లో ట్రావెల్ చేయాలన్నా, RTC బస్సులో వెళ్లాలన్నా ట్రాఫిక్ తిప్పలతో పాటు ఉక్కపోత. పైగా గంటలో వెళ్లాల్సిన చోటుకు 20- 30 నిమిషాల్లోనే ACలో వెళ్తుండటంతో చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.

Similar News

News March 21, 2026

MHBD: పురుగు మందు తాగిన బాలుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసలతండకు చెందిన గుగులోత్ పవన్ పురుగు మందు తాగి మృతి చెందాడు. గుగులోత్ రాందాస్, స్వరూప కుమారుడైన పవన్(3వ తరగతి)స్కూలుకు వెళ్లడం లేదని తల్లి మందలించింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు పురుగు మందు తాగాడు. రెండు రోజులు తర్వాత తన తల్లికి చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో విషాధచాయలు అలముకున్నాయి.

News March 21, 2026

బాపట్ల: నాడు సినీ బౌన్సర్.. నేడు దొంగ

image

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చందోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాపట్ల DSP జగదీష్ నాయక్ వెల్లడించారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈనెల 7న దొంగతనం చేసిన నిందితుడు ఆటో దిగి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో సినీ ఫీల్డ్‌లో బౌన్సర్‌గా చేశాడన్నారు.

News March 21, 2026

ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

image

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.