News March 18, 2026
అల్లూరి: ‘గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి’

గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం పాడేరు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి పోలవరం, అల్లూరి జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News April 16, 2026
HYD: బోరు బండి కార్మికుల ప్రాణాలతో చెలగాటమా!

నగరంలో యథేచ్ఛగా బోర్లు వేస్తున్నారు. వేసవిలోనూ వందల ఫీట్లు తవ్వుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఈ లారీపై పనిచేసే UP, బిహార్, ఒడిశా కార్మికులకు రక్షణ కరవవుతోంది. వీధుల్లో కరెంటు వైర్లు చేతులతో పట్టుకుంటున్నారు. ఇంటి, బండి యజమానులు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే తుర్కయంజల్లో కొత్తిల్లు నిర్మిస్తుండగా కరెంటు తీగ తగిలి ఓ కార్మికడు మృతి చెందాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
News April 16, 2026
సూర్యాపేట: గ్రామస్థుల ఆదర్శ నిర్ణయం

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నాగారం మండలంలో అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టింది. పోలీసుల అవగాహనతో స్ఫూర్తి పొందిన ఈటూరు, ఫణిగిరి గ్రామస్థులు.. ప్రాణ రక్షణ కోసం స్వచ్ఛందంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హెల్మెట్ లేనిదే గ్రామంలోకి ప్రవేశం లేదు’ అంటూ ఊరి పొలిమేరల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలే బాధ్యతగా తీర్మానాలు చేసుకోవడం పట్ల పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
News April 16, 2026
BREAKING.. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

కరీంనగర్ నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా కార్యాలయంలోని పలు విభాగాలకు చెందిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


