News March 18, 2026

పెద్దపల్లి: ‘మూడు విడతల్లో రైతు భరోసా’

image

యాసంగి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. CM రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 1,51’300 మంది రైతుల ఖాతాలో రూ. 162.52 కోట్లు నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ అవుతాయన్నారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు నూతనంగా రైతు భరోసా కోసం AEO ల వద్ద మార్చి 25 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 13, 2026

రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే..

image

AP: వివిధ శాఖల్లో రిటైరైన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ తదితరాలకు సంబంధించిన ఫైళ్లను మే1 నుంచి ఆన్‌లైన్(నిధి పోర్టల్)లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ఫైళ్ల ఫిజికల్ కాపీలను APR30 వరకు మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో అనుమతించేది లేదని తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా దీన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.

News April 13, 2026

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ మరో 3-4 రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు తెలిపాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18న HYDలో SRHతో జరిగే మ్యాచులో ఆడతారని పేర్కొన్నాయి. కండరాల నొప్పి కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపు KKRతో మ్యాచులో ఆయన ఆడతారని టీమ్ మేనేజ్‌మెంట్ తొలుత భావించింది. కానీ పూర్తి ఫిట్‌గా మారేందుకు ఆయనకు మరికొంత టైమ్ అవసరమని సమాచారం.

News April 13, 2026

ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో మార్పులు

image

AP:ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో బోర్డు ఈఏడాది కొన్ని మార్పులు చేసింది. రిజల్ట్స్‌లో విద్యార్థుల 5గ్రూపు సబ్జెక్టుల మార్కులను మాత్రమే ప్రకటిస్తారు. ఆరోదైన అదనపు సబ్జెక్టు మార్కులు వాటితో కలపరు. కాలేజీకి పంపే మార్కుల మెమొరాండంలో వాటిని వేరుగా చూపిస్తారు. ఆ సబ్జెక్టులో ఫెయిలైనా గ్రూపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే చాలు పాస్‌గా పరిగణిస్తారు. MPCలో బయాలజీ, BiPCలో మాథ్స్ అదనపు సబ్జెక్టులుగా ఉన్నాయి.