News March 18, 2026
భద్రాద్రిలో నాటి రామ-లక్ష్మణుల వంటకు సజీవ సాక్ష్యాలు

భద్రాద్రి రామయ్యను దర్శించుకునే భక్తులను అంబసత్రంలోని పురాతన ఇత్తడి గుండిగలు(ఒక్కొక్కటి 25 KGలు) విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 150 ఏళ్ల క్రితం రామభక్తుడు పనిఘంటం వెంకటరమణ హరిదాసు ఇక్కడ నిత్య అన్నదానం చేసేవారు. ఒకానొక శ్రీరామనవమికి భక్తులు పోటెత్తగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ పెద్ద గుండిగల్లో వంట చేసి వెళ్లారని, వారే సాక్షాత్తు రామలక్ష్మణులని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Similar News
News April 20, 2026
హనుమకొండలో విద్యార్థినిపై దారుణం.. వీడియో వైరల్

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
News April 20, 2026
రహానే చెత్త రికార్డు

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్(బ్యాటింగ్ పొజిషన్తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్వెల్(19) టాప్లో ఉన్నారు. కాగా సీజన్లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్తో 152 రన్స్ చేశారు.
News April 20, 2026
భర్త మృతిపై పోలీసుల ప్రమేయం లేదు: లక్ష్మి

దొంగతనం బయటపడటం, పాత కేసుల అవమాన భారంతోనే తన <<19694132>>భర్త<<>> వెంకటసుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మి వెల్లడించారు. ఆదివారం రాత్రి అవుకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం కుమారుడు సుమంత్తో కలిసి ఆమె ఈ వివరాలు తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని పేర్కొన్నారు.


