News March 19, 2026

BREAKING: ప్రభుత్వ విప్‌లుగా వేముల, అద్దంకి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతలకు రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కింది. ప్రభుత్వ విప్‌లుగా శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలిలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పదవుల్లో రెండు జిల్లాకే దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమ నేతల నియామకంపై అనుచరులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Similar News

News April 18, 2026

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

image

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

News April 18, 2026

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

News April 18, 2026

మదనపల్లెలో నేటి టమాటా ధరల వివరాలు.!

image

మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో టమాటాలు రూ.24కి కొనుగోలు చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకు వచ్చారు. స్థానిక వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటాల బాక్స్ రూ.240 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే రెండవ రకం టమాటాలు రూ.190 అమ్ముడు పోగా.. మూడవ రకం టమాటాలు రూ.180 పలకడంతో రేట్లు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.