News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News April 6, 2026
IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్లో KKR ఫామ్లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.
News April 6, 2026
లేఆఫ్స్ వద్దు.. రీస్కిల్లింగ్పై దృష్టి పెట్టండి: NITES

టెక్ కంపెనీలు లేఆఫ్స్కు బదులు ఉద్యోగుల స్కిల్స్ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్ను చివరి ఆప్షన్గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా కోరారు.
News April 6, 2026
ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.


