News May 6, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!
✏NGKL:తెలకపల్లిలో వైద్యం వికటించి..వ్యక్తి మృతి
✏NRPT:అక్రమంగా తరలిస్తున్న 16,560 లీటర్ల మద్యం పట్టివేత
✏ఎర్రవల్లి:వాహనం ఢీకొని మహిళ మృతి
✏కల్వకుర్తి:MLA కసిరెడ్డి వాహనానికి ప్రమాదం.. ఒకరి మృతి
✏WNPT:BJPకి పలువురు రాజీనామా
✏ప్రారంభమైన డిగ్రీ అప్లికేషన్లు..PU పరిధిలో 29,740 సీట్లు
✏EVM పై సిబ్బందికి అవగాహన
✏అచ్చంపేట:మాజీ ఎమ్మెల్యే గువ్వలకు నిరసన సెగ
✏ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి:TPUS
Similar News
News September 29, 2024
గద్వాల: ఉద్దెర ఇవ్వలేదని.. కాలుతున్న నూనె పోశాడు.!
యజమానిపై కాలుతున్న వంట నూనె పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో చోటు చేసుకుంది. SI శ్రీనివాసులు వివరాల ప్రకారం.. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ గ్రామంలో చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ ఉద్దెర ఇవ్వలేదని కోపంతో కాలుతున్న నూనె బుజ్జన్న గౌడ్పై పోయగా.. పక్కలో ఉన్న మరో వ్యక్తి వీరేష్పై పడింది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 29, 2024
MBNR: ఓటరు జాబితా OK.. రిజర్వేషన్లే అసలు తంతు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓటరు తుది జాబితా అన్ని గ్రామాల్లో అధికారులు ప్రదర్శించారు. దీంతో గ్రామాల్లో రిజర్వేషన్ల పైనే చర్చ నడుస్తుంది. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ను పది సంవత్సరాలు కొనసాగించాలని గత ప్రభుత్వం చట్టం చేసింది. బీసీకు వార్డులు, పంచాయతీల రిజర్వేషన్లు పెంచేందుకు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News September 29, 2024
MBNR: దివ్యాంగుడిని బ్రతికుండగానే చంపేశారు!
బతికున్న వ్యక్తిని ఆసరా పింఛను పోర్టల్లో చనిపోయినట్లు నమోదు చేయడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ మండలం ఖాన్దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు దివ్యాంగ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పెన్షన్ మంజూరు కాలేదని ఆరా తీయగా.. అధికారులు ఆసరా పోర్టల్లో చూసి’ నీవు చనిపోయినట్లు ఆసరా పోర్టల్లో ఉంది’ అని తెలిపారు. దీంతో హన్మంతు 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.