News March 21, 2026

ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై పాడేరులో విస్తృత ప్రచారం

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.

Similar News

News April 7, 2026

మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

జనగామ మాతా, శిశు ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం కాకుండా చూడాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్.. వారికి నాణ్యమైన మందులు, పోషకాహారం అందించాలని వైద్యులను కోరారు.

News April 7, 2026

ఏలూరు: అనాథ చిన్నారులకు.. నూతన జీవితం

image

అనాథలైన ముగ్గురు పిల్లలకు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి నూతన జీవితాన్ని అందించారు. కుక్కునూరుకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి వారిని వదిలేసి వెళ్లడంతో చిన్నారులు అనాథలయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ బాల సంరక్షణ అధికారుల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ఆమె ఆ చిన్నారులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.

News April 7, 2026

అమలాపురం: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

అమలాపురం మండలం బండారులంకలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరగిరిపట్నంకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం డిపోకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనంపై అంబాజీపేట వైపు వెళ్తున్న యువకుడిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.