News March 22, 2026
మూడో రోజే ₹500 కోట్ల క్లబ్లోకి ధురంధర్-2

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్స్టోన్ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.
Similar News
News April 11, 2026
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <
Share It
News April 11, 2026
రేపటి వరకు వర్షాలు!

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.
News April 11, 2026
బాలీవుడ్ డైరెక్టర్తో రామ్ చరణ్ సినిమా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు సమాచారం. దాదాపు ₹800 కోట్ల బడ్జెట్తో హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్ రూపొందనుందని టాక్. భన్సాలీ తన ‘గంగూబాయి కతియావాడి’ విజయం తర్వాత ఈ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. చరణ్ 2013లో ‘జంజీర్’(తుఫాన్)తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.


