News March 22, 2026

త్వరలో యాదాద్రికి MMTS

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు త్వరలో రైల్వే శాఖ తీపి కబురు అందించనుంది. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా MMTS రెండో దశ పనులకు అంకురార్పణ జరగనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు 33KM మేర కొత్త లైన్ నిర్మించి, రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భక్తులు అతి తక్కువ ఖర్చుతో నేరుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.

Similar News

News April 1, 2026

అల్లూరి: పురిటినొప్పులతోనే మూడు కి.మీల డోలి ప్రయాణం

image

అల్లూరి జిల్లాలో డోలి మోతలు తప్పడం లేదు. డుంబ్రిగుడ మండలం, కొల్లాపుట్టు పంచాయతీ డొకిరిపాడు గ్రామానికి చెంది పాంగి డొమినికి బుధవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. రోడ్డు లేక పురిటినొప్పులతో ఉన్న డొమినిని కుటుంబ సభ్యులు, బందువులు మూడు కి.మీలు డోలీ మోశారు. అంబులెన్స్ అందుబాటులో లేక, ఆటో‌లో అరకు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బొడ్లమామిడి, డొకిరిపాడు, నిట్టమామిడి గ్రామాలకు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు

News April 1, 2026

బీర్లు తెగ తాగేస్తున్నారు..

image

​కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కర్నూలు జిల్లాలో ఐఎంఎల్ 54 శాతం, బీర్ 88 శాతం వృద్ధితో రూ.1143.82 కోట్ల ఆదాయం లభించింది. నంద్యాల జిల్లాలో ఐఎంఎల్ 18 శాతం, బీర్ 88 శాతం వృద్ధి నమోదు కావడంతో రూ.971.52 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కర్నూలు జిల్లాలో 34 శాతం, నంద్యాల జిల్లాలో 8 శాతం మేర ఆదాయం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

News April 1, 2026

రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.