News March 22, 2026
ASF జిల్లాలో పోలీసుల వసూళ్ల దందా?

జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారుల వద్ద నెలకు రూ.1.15లక్షలు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరాణా వ్యాపారులను సైతం వదలకుండా హఫ్తాల కోసం వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఓ CI, మరో డివిజన్ స్థాయి అధికారి వ్యాపారులను పిలిపించి వసూలు చేస్తున్నారని బాధితులు DGP శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Similar News
News April 18, 2026
కర్నూలు: 10కి చేరిన మృతుల సంఖ్య

మంత్రాలయం(M) చిలకలడోణ గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగిన రోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక, బెల్లి, యశోద, పుట్టమ్మ, లాలాక్షి, మీనాక్షి, సునీల్, కుమార్ మృతిచెందారు. కర్నూలు GGHలో చికిత్స పొందుతూ తేజస్విని శుక్రవారం మృతి చెందింది. నేడు శోభ అనే మహిళ మరణించింది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.
News April 18, 2026
ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.
News April 18, 2026
ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


