News May 7, 2024

కరీంనగర్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

ఆన్లైన్ గేమ్‌లతో డబ్బులు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగాధర మండలం మధురానగర్‌కు చెందిన లక్ష్మణ్- లక్ష్మి కుమారుడు పృథ్వీ (25) నోయిడా(UP)లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు స్నేహితుల వద్ద రూ.12 లక్షల అప్పు చేసి ఆన్లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. ఆ అప్పు ఎలా తీర్చాలనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 13, 2025

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

image

జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

News September 12, 2025

కరీంనగర్‌లో ఈనెల 17న జాబ్ మేళా

image

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 12, 2025

కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా రమేశ్

image

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.