News March 24, 2026
మిర్యాలగూడ: తండ్రి ముందే కొడుకు మృతి

జ్వరంతో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్న చరణ్ అనే బాలుడిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. దామరచర్ల మండలం బెట్టెతండాకు చెందిన బాలుడు తండ్రితో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా, మిర్యాలగూడ హైవే అగ్రిగోల్డ్ కాలనీ వద్ద ధాన్యం ట్రాక్టర్ ఇంజిన్ తగిలింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, బాలుడిపై నుంచి టైరు వెళ్లడంతో మృతి చెందాడు. కళ్లముందే కొడుకు ప్రాణాలు పోవడంతో తండ్రి రోదనలు మిన్నంటాయి.
Similar News
News April 6, 2026
ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
News April 6, 2026
HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్గా, ఓపెన్ జిమ్గా మార్చితే సరి. మీరేమంటారు?
News April 6, 2026
కడప: రవాణా శాఖకు రూ.195.21 కోట్ల ఆదాయం

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించింది. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీఓ, పులివెందుల, బద్వేల్, రాజంపేటలో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు, పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.


