News March 24, 2026
వనపర్తిలో ఎండల తీవ్రత!

వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో వెలుగొండలో అత్యధికంగా 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడలో 38.6 డిగ్రీలుగా రికార్డయ్యాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 31, 2026
మలయాళంలోకి అనుష్క ఎంట్రీ.. ఇవాళే ట్రైలర్

హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన ‘కథనార్’ ట్రైలర్ ఇవాళ మ.1.31 గంటలకు రిలీజ్ కానుంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్లో జయసూర్య లీడ్ రోల్ చేస్తుండగా ప్రభుదేవా కీలకపాత్ర పోషిస్తున్నారు. 9వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మతగురువు కడమట్టతు కథనార్ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
News March 31, 2026
లాస్ట్ సీజన్ రన్నరప్.. పంజాబ్ ఈసారైనా కప్పు కొడుతుందా?

IPL: గత ఏడాది రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈరోజు ఈ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడగా చెరో మూడుసార్లు గెలిచాయి. గత సీజన్లో పంజాబ్ కెప్టెన్గా శ్రేయస్, గుజరాత్ కెప్టెన్గా గిల్ కూడా రాణించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్లో బోణీ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. చండీగఢ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
News March 31, 2026
ఒంగోలు: ట్రాఫిక్ పోలీసుల చాకచక్యం

బళ్లమిట్టకు చెందిన టి. విజయ ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగేటప్పుడు రూ.50,000 నగదు, తాళాలు ఉన్న పర్సును మర్చిపోయారు. విషయం తెలియజేయగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సీసీటీవీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో యజమానిని సంప్రదించగా పర్సు ఆటోలోనే ఉన్నట్లు తెలిసింది. అనంతరం ట్రాఫిక్ సీఐ జగదీష్ సమక్షంలో పర్సును బాధితురాలికి అప్పగించారు.


