News May 7, 2024

రేపు కలికిరికి మోదీ రాక

image

ప్రధాని మోదీ బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. స్థానిక సైనిక స్కూల్ వెనుక వైపు 35 ఎకరాల మైదానంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.

Similar News

News October 23, 2025

చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777

News October 22, 2025

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

image

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.