News May 8, 2024
సింహాచలం: నేడు కూడా అందుబాటులో చందనోత్సవ టికెట్లు

సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల విక్రయాలు బుధవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆన్ లైన్తో పాటు సింహాచలం నగరంలోని మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో టిక్కెట్లు పొందవచ్చునని అన్నారు.
Similar News
News October 23, 2025
విశాఖలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టు

విశాఖ ఎంవీపీ కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన శ్రీరాం గుప్తా, వరప్రసాద్ కలిసి ఒక రూమ్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు దాడి చేశారు. ప్రింటర్స్, ఫోన్లు, కరెన్సీ తయారీ సామాగ్రి, లాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద బస్సు, లారీ ఢీ

విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.
News October 23, 2025
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పలు అభివృద్ధి పనులకు ఆమోదం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ సమక్షంలో బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 205 ప్రధాన అంశాలు, 12 టేబుల్ అజెండాలతో మొత్తం 217 అంశాలు పొందుపరిచారు. వాటిలో 4 అంశాలను వాయిదా వేసి 213 అంశాలకు ఆమోదం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్పై అవినీతి ఆరోపణలు వస్తున్నందున అతనిని విధుల నుంచి తొలగించాలని స్థాయి సంఘం సభ్యులు అధికారులకు సూచించారు.