News May 8, 2024
శ్రీకాకుళంలోనే అత్యధిక సర్వీస్ ఓట్లు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. నేవీ, ఆర్మీ ఎయిర్పోర్స్తో పాటు సాయుధ దళాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవాలందిస్తుంటారు. పలాసలో 3,030, టెక్కలి 2,919, ఆమదాలవలస 2,240 నరసన్నపేటలో 2,228 మంది ఓటర్లు నమోదు చేస్తుకున్నారు.
Similar News
News December 28, 2025
పెండింగ్ ప్రాపర్టీ కేసులు వేగంగా పరిష్కరించాలి: SP

దీర్ఘకాలికంగా దర్యాప్తు పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని నేరాల స్థితిగతులు, శాంతి భద్రతలు, విజిబుల్ పోలిసింగ్, ఎన్ఫోర్స్మెంట్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ రమణ ఉన్నారు.
News December 28, 2025
SKLM: ప్రతిభకు జిల్లా ఎస్పీ ప్రశంస

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కేసుల చేదన, గంజాయి పట్టివేత, గుడ్ వర్క్స్ వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఉత్తమ సేవలకు గాను సీఐలు పైడపు నాయుడు,(SKLM రూరల్) చంద్రమౌళి,(సీసీఎస్) సత్యనారాయణ (ఆమదాలవలస)తో పాటుగా పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
News December 27, 2025
SKLM: నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ సూచనలు

న్యూఇయర్, సంక్రాంతి, రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా శనివారం రాత్రి శ్రీకాకుళంలో పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలో నేరాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ముందుండాలని అధికారులకు సూచించారు.


