News May 8, 2024

కాకినాడ: బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కాకినాడ జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్లలోపు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రధానం చేసేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు కో డైరెక్టర్ ప్రవీణ మంగళవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, సాహిత్యం, సంగీతం, నృత్యం తదితర వాటిలో ప్రతిభ చూపిస్తున్న బాలలు జూలై 31 లోగా ఆన్లైన్ దరఖాస్తులు పంపాలన్నారు.

Similar News

News December 28, 2025

‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

image

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.

News December 28, 2025

‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

image

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.

News December 28, 2025

జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

image

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్‌గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.