News March 28, 2026
భీమవరం: అర్జీల పరిష్కారంపై జేసీ సమీక్ష

భీమవరం: కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కార ప్రగతిని శనివారం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. గత నవంబర్ నుంచి ఐదు నెలల వ్యవధిలో మొత్తం 16,663 అర్జీలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిష్కారాల నాణ్యతపై ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించినట్లు పేర్కొన్న జేసీ, ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 20, 2026
తణుకు: ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య

తణుకు మండలం పైడిపర్రుకు చెందిన అనుమోలు దేవి(31) సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందగా, ఎస్సై జానా సతీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 20, 2026
భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News April 20, 2026
10 గంటల నుంచి పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, https://Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.


