News May 8, 2024

రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బూరుగుపూడి నుంచి జగ్గంపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి డివైడర్‌పై పడి, తలకు బలమైన గాయమవడంతో వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలైన కుమారుడిని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి: డీఈఓ

image

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈఓ కంది వాసుదేవరావు శనివారం తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు. విద్యాసంస్థల గుర్తింపును పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.