News March 29, 2026
నల్లగొండ: వేదిక మారింది.. రాతలు మారేనా..?

నల్లగొండ జిల్లాలో దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సరికొత్త శ్రీకారం చుట్టింది. ప్రతి నెల చివరి శనివారం వీరికి మాత్రమే కేటాయిస్తూ ప్రత్యేక ‘ప్రజావాణి’ని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సాధారణ రోజుల్లో రద్దీ వల్ల వీరు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News April 20, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.


