News May 8, 2024
అన్ని మాఫియాలకు ట్రీట్మెంట్ ఇస్తాం: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1714562319778-normal-WIFI.webp)
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని మాఫియాలకు పక్కాగా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘కేంద్ర పథకం జల్జీవన్ మిషన్కు YCP ప్రభుత్వం సహకరించలేదు. ఇంటింటికీ పైప్లైన్ ద్వారా నీళ్లు అందించాలనే లక్ష్యాన్ని నీరుగార్చింది. AP ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. YCP మంత్రులు గూండాయిజం చేస్తున్నారు’ అని విమర్శించారు.
Similar News
News January 7, 2025
టెంబా బవుమా సరికొత్త రికార్డ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736180812543_1032-normal-WIFI.webp)
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.
News January 7, 2025
కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736190872085_653-normal-WIFI.webp)
పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె పేరెంట్స్ తమిళనాడు, పంజాబ్కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.
News January 7, 2025
నిధులన్నీ కుంభమేళాకేనా.. గంగాసాగర్ మేళాకు ఇవ్వరా?: మమత బెనర్జీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736181400356_1124-normal-WIFI.webp)
UPలో కుంభమేళాకు వేల కోట్ల నిధులిచ్చే NDA ప్రభుత్వం బెంగాల్లో జరిగే గంగాసాగర్ మేళాకు ఎందుకివ్వదని CM మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఒక వైపు మడ అడవులు, మరో వైపు సముద్రం ఉండే గంగాసాగర్కు నీటి మార్గంలో చేరుకోవాలన్నారు. ఇక్కడ కేంద్రం బ్రిడ్జి నిర్మించకపోవడంతో తమ ప్రభుత్వమే ఆ పని చేస్తోందన్నారు. గంగా నది-బంగాళాఖాతం కలిసే చోటును గంగాసాగర్గా పిలుస్తారు. ఇక్కడ ఏటా సంక్రాంతికి జాతర జరుగుతుంది.