News March 30, 2026

ఢిల్లీకి రావాల్సిన ఇరాన్ విమానంపై అమెరికా దాడి

image

సరకులు, ఔషధాలు తదితర మానవతా సాయాన్ని పొందేందుకు ఢిల్లీకి రావాల్సిన మహాన్ ఎయిర్ జెట్ విమానం అమెరికా దాడిలో ధ్వంసమైంది. ఇరాన్‌లోని మషద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఫ్లైట్ ఉండగా దాడి జరిగింది. భారత్ ఇప్పటికే మార్చి 18న నిత్యావసరాలను టెహ్రాన్‌కు పంపిన విషయం తెలిసిందే. రెండో దఫా 11 టన్నుల సరకులను సిద్ధంగా ఉంచింది. వీటి కోసం మహాన్ విమానం ఎల్లుండి ఢిల్లీకి రావాల్సి ఉంది.

Similar News

News April 14, 2026

మంత్రి సత్య కుమార్ చొరవ.. ఓ కుటుంబంలో వెలుగులు

image

కదిరికి చెందిన చరణ్ కుమార్ ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్య కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న చరణ్‌కు మంత్రి చొరవతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. క్లిష్ట సమయంలో స్పందించి ఆర్థికంగా, వైద్యపరంగా సహాయం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు మంత్రికి చరణ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

News April 14, 2026

కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

image

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్‌ తొలగిపోతాయి.

News April 14, 2026

గుడ్‌న్యూస్ చెప్పిన LIC

image

ప్రభుత్వ బీమా సంస్థ LIC తమ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. రికార్డు తేదీ నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి షేరుకు అదనంగా ఉచిత షేరును ఇవ్వనుంది. అంటే మీ వద్ద 100 షేర్లు ఉంటే బోనస్ తర్వాత అవి 200 షేర్లు అవుతాయి. రికార్డ్ డేట్‌ను త్వరలో ప్రకటించనుంది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లో LIC లిస్ట్ అయింది.