News May 8, 2024

క్యాష్ లోన్లపై ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు!

image

నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు క్యాష్ లోన్లు మంజూరు చేయడంపై RBI కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్యాష్ లోన్లు రూ.20వేలకు మించి మంజూరు చేయొద్దని పేర్కొందట. ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269SS ప్రకారం నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. IIFL ఫైనాన్స్‌లో ఇటీవల అవకతవకలు జరిగిన నేపథ్యంలో NBFCలకు RBI ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

Similar News

News February 5, 2026

పాకిస్థాన్‌లో టాప్-1లో నిలిచిన ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ OTTలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ గత నెల 30న Netflixలో విడుదలై కేవలం 3 రోజుల్లోనే 7.6M వ్యూస్ సాధించింది. ‘యానిమల్’ (6.2M), ‘ఫైటర్’ (5.9M), ‘పుష్ప-2’ (5.8M) రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలోనూ దూసుకుపోతోంది. 7 దేశాల్లో టాప్-10లో నిలిచిన ‘ధురంధర్’ పాకిస్థాన్‌లో నంబర్-1లో నిలవడం విశేషం.

News February 5, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.

News February 5, 2026

హిందీ మాత్రమే నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవాల్సిందే: మంత్రి

image

హిందీ వివాదం వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళియన్లు మాతృభాషతోపాటు ఇంగ్లిష్ నేర్చుకుని US, UKలో ఉద్యోగాలు సాధించి రూ.కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.