News April 1, 2026
దారపు రీల్స్తో రామ మందిరం!

పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్ నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో ‘అయోధ్య రామ మందిరం’ నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ‘రీయూస్’ నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Similar News
News April 6, 2026
రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News April 5, 2026
కొవ్వూరు: కరెంటు షాక్తో రైతు మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన ఘటన కొవ్వూరులో జరిగింది. కొవ్వూరు హైవే రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పొలంలో కరెంటు తీగలు తెగిపడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుడు పసివేదల గ్రామానికి చెందిన కౌలు రైతు శ్రీను(60)గా గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.
News April 5, 2026
దండంగి కొండలపై పులి సంచారం

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.


